మూలకారణము

కశ్యప ప్రజాపతి, వామనుడు, రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు వసియించి సిద్ధిపొంది వారి వలన ప్రసిద్ధిపొందిన పుణ్యప్రదేశము సిద్ధాశ్రమము. వేద కాలమునాటి సత్సంప్రదాయమును యధాతధముగా పునరుద్ధరింప తలంపుతో పరబ్రహ్మ బ్రహ్మకు ఉపదేశించిన బ్రహ్మవిద్యను గురుపరంపర న్యాయముగా అందచేయ తలంపుతో వ్యవస్ధాపకుని నివాస గృహము ప్రధాన కేంద్రముగా హైదరాబాదు యందలి వనస్థలిపురంలొ సిద్ధాశ్రమము నెలకొల్పబడి నేటికి 25 సం || ల నుండి పనిచేయుచున్నది.

కలియుగములో వ్యాసభగవానుడు తన భాగవతము పంచమ స్కంధము 6వ అధ్యాయము 10వ 11వ శ్లోకములలో చెప్పిన పరిస్థితులు క్రమక్రమముగా చోటుచేసుకొనుచున్నవి. ఈ పరిస్థితులలొ బౌద్ధ, జైన, మతములు ఏర్పడినవి. ఆ తరువాత కాలములో శైవ, వైష్ణవ, శాక్తేయ మతములు ఏర్పడినవి. పరాయి దేశస్థుల పాలనలొ ఇస్లాము, క్రైస్తవ మతములు కూడా మన దేశములో చోటుచేసుకొన్నవి. క్రైస్తవ మతప్రచారకులు వారి మతప్రచారముతో పాటు సాంఘిక సేవా కార్యక్రమములు కూడా చేసెడివారు.

ఇటివల కాలములో అనేక సంస్థలు ఏర్పడి వారి వ్యక్తిగత అభిప్రాయములను ప్రజలలో ప్రచారము చేయుచు సాంఘిక సేవ కార్యక్రమములు కూడ చేపట్టిరి . వీటి అన్నింటిలోనూ వేదకాలమునాటి ఆధ్యాత్మిక భావనా పూర్తిగా ప్రజలకు అందుట లేదు . ఈ పరిస్థితులలో వేదము నందలి ఆధ్యాత్మిక భావనను యధాతధముగా ప్రజలకు అందజేయుటతో పాటు వేదము చెప్పిన ఆత్మస్థానమును చేరు మార్గమును తెలియచేయుటకు సిద్ధాశ్రమము నడుము బిగించినది.

ఆబ్జెక్టివ్

వేద కాలమునాటి సత్సంప్రదాయమును యధాతధముగా పునరుద్ధరించి , పరబ్రహ్మ బ్రహ్మకు ఉపదేశించిన బ్రహ్మవిద్యను గురుపరంపర న్యాయముగా అందజేసి ; వేదము నందలి ఆధ్యాత్మిక భావనను యధాతధముగా ప్రజలకు అందజేయుటతో పాటు వేదము చెప్పిన ఆత్మస్థానమును చేరు మార్గమును తెలియచేయుటకు సిద్ధాశ్రమము నడుము బిగించినది.

సభ్యత్వము

ఈ ఆశ్రమ సభ్యులకు సభ్యత్వ రుసుము లేదు. ఆధ్యాత్మిక విషయములను తెలుసుకొనవలయునన్న తీవ్రకాంక్ష కలవారందరు సభ్యులుగా చేరుటకు అర్హులు.

ఈ ఆశ్రమ వ్యవహారములు 3 స్థాయిలలో ఉండును.

  • రారంభస్థాయి : ఈ స్థాయిలో వర్తమానకాలములోని పరిస్థితులకు అనుగుణముగా పూజలు , భజనలు , తీర్థయాత్రలు , ఉచిత వైద్యశిబిరములు , అన్నదాన కార్యక్రమములు మొదలైన సేవ కార్యక్రమములు ఉండును. ఆవిధముగా రామకోటి స్తంభము , కోటిబిల్వార్చన , విరాట్ స్వరూప ఈశ్వరార్చన మొదలైన పూజలు జరుపబడినవి . ఆ సేతు హిమాచల పర్యతము గల పుణ్య క్షేత్రములతో పాటు కాలినడకన నేపాల్ లో గల ముక్తినాధ్ క్షేత్రమును కూడ బహు ప్రయాసలతో దర్శించడమైనది. మహాశిరాత్రి సందర్భమున శ్రీకాకుళం జిల్లా చాపకోట సమీపమున మహేంద్రగిరి యాత్రకు వచ్చు యాత్రీకులకు ఉచిత భోజన , వైద్య సదుపాయములు గత 2 సం || లు జరుపబడినవి.
  • మధ్యమస్థాయి : ఈ స్థాయి వారికై ఆధ్యాత్మిక భావనలు , సాధనలు పరిచయముగా పుస్తక ప్రచురణలు చేపట్టి భక్తులకు అందచేయబడుచున్నవి . ఆ విధముగా ఇప్పటికి పూజాపుష్పములు, పూజావిధానము , భూతనాధోపాఖ్యానము , బ్రహ్మవిద్యారత్నాకరము , అను పుస్తకములు ప్రచురింపబడినవి . అటులనే అనతి కాలములొ నిత్యకర్మానుష్థానమునకు సంబంధించిన సంధ్యావందనము , బ్రహ్మయజ్జ్ఞము మొదలైనవి అటులనే భగవద్గీత మొదలైన పుస్తకములు ప్రచురింపబడును.
  • ఉన్నతస్థాయి : ఈ స్థాయిలొ సాధకులు వకచోట కూర్చొని వేదములు , రామాయణ , భారత భాగవతాది పూరణములలోని రహస్యములను చర్చించుకొనుచు ఆత్మస్థానము పొందు సాధన చేయుచు ఋషుల పంన్ధాలో పయనించెదరు.

మా ఫోటో గ్యాలరీని చూడండి